

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆర్ సీ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శనివారం నాడు సమగ్ర శిక్ష ఉద్యోగు ల నిరసన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఆర్పిల అధ్యక్షులు శ్రీధర్ కుమార్మా ట్లాడుతూ.సమగ్ర శిక్ష లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం విద్యాశాఖలో విలీనం చేసుకొని వారికి రెగ్యులరైజ్ చేయాలని అప్పటివరకు కనీస వేతనం అమలు పరచాలని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సదుపాయాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి వేతనాలను తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు వర్తింపజేయాలని ఆయన అన్నారు. 60 సంవత్సరాలు నిండిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు పదవి విరమణ చేసిన తర్వాత కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇంటికి పంపిస్తున్నారని దీనితో ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు సమగ్ర శిక్ష ఉద్యోగులు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను మట్టి ఖర్చుల కింద తక్షణమే 15000 రూపాయలను ప్రభుత్వ అందిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు పెండ రియల్ చార్జెస్ కూడా ప్రభుత్వం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పనిచేస్తున్న 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరోగ్య కార్డు పిఎఫ్ సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్టియు ఉమ్మడి మండలం అధ్యక్ష కార్యదర్శులు ,నాయకులు నారాయణ ,సురేందర్, వెంకట్ రెడ్డి,, జనార్ధన్ రాజు, ఎస్టి,ఎస్సీ సంఘ నాయకులు దేవి సింగ్, భీమ్రావు టియూ టి ఆఫ్ జిల్లా అధ్యక్షులు ప్రవీన్ కుమార్, సిఆర్పిలు బి శ్రీధర్ కుమార్ ,పి నర్సింలు, వెంకట రామా గౌడ్ ,శంకర్ గౌడ్ ,వరలక్ష్మి ఐ ఆర్ పి చిన్న సాయిలు, సునీల్ ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ రాజు పి టి ఐ ప్రతాప్ భూమయ్య పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు