సికిల్ సెల్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి డాక్టర్ దుర్గాభవాని

మన న్యూస్: పినపాక, శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యత సికిల్ సెల్ అంటారని ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గా భవాని తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పాతరెడ్డిపాలెం సబ్ సెంటర్ పరిధిలో జరుగుతున్న సికిల్ సెల్ పరీక్షలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయన్నారు. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయని దానివల్ల న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్… వంటివి వ్యాధి లక్షణాలలు కనిపిస్తాయని తెలిపారు. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుందని గ్రామస్తులకు ఆమె వివరించారు. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారన్నారు. సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారని సికిల్ సెల్ పరీక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు. 2047 సంవత్సరానికల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జన్యు రక్త వ్యాధి అని ఇది బాధిత రోగి యొక్క మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఇది భారతదేశంలోని గిరిజన జనాభాలో సర్వసాధారణం కానీ గిరిజనేతరులలో కూడా సంభవిస్తుందన్నారు. ఈ కార్యక్రమం సున్నా నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు మొత్తం జనాభాను కవర్ చేసే మిషన్ మోడ్‌లో నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పినపాక మండల పరిధిలోగల ఎల్సిరెడ్డిపల్లి, మినీ గురుకులం పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విద్యార్థులందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అనారోగ్య సమస్యలు ఉంటే వార్డెన్ సహాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. ఫుడ్ పాయిజన్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.