కలిగిరి మోడల్ స్కూల్, బెస్ట్ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపిక..! పి యం శ్రీ పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

నూతన జాతీయ విద్యా విధానమే పీఎం శ్రీ పాఠశాలల లక్ష్యం..!!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్ బెస్ట్ పి యం శ్రీ పాఠశాలగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మోడల్ స్కూల్ ను బెస్ట్ పి ఎం శ్రీ స్కూల్ కింద మార్చడం పట్ల, హర్షం వ్యక్తం చేస్తూ, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
మంగళవారం కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ముందుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి విద్యార్థులు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పీఎం శ్రీ పాఠశాలలో అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఈ పథకం కింద ఏర్పాటు చేసిన పాఠశాలలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు, కేంద్రీయ విద్యాలయ సంఘటన మరియు నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 14,500 స్కూల్ లను ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 623 పాఠశాలలో ఎంపిక అయ్యాయి అన్నారు. ఈ పాఠశాలల లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడం మరియు వారిలో అభివృద్ధిని పెంపొందించడం, నూతన జాతీయ విద్యా విధానం అందించడం, అన్ని వనరులను సమకూర్చడం, సురక్షితమైన మరియు ఉత్తేజపరిచే అభ్యాస వాతావరణాన్ని కలిగించడం వీటి లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో మొత్తం నాలుగు మోడల్ స్కూల్ ఉండగా కలిగిరి మోడల్ స్కూల్ బెస్ట్ పి ఎం శ్రీ పాఠశాలగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావుల కొల్లు సర్పంచ్ పీవీ నాయుడు, కాకి మహేష్, మధు మోహన్ రెడ్డి, సర్పంచ్ వెంకటసుబ్బయ్య, చీమల తాతయ్య, బి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.