అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్


మన న్యూస్,*నిజాంసాగర్*( జుక్కల్ ) అందరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో ఆ జీపి కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.కాటేపల్లి తండాలో 34 కొత్త రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. 36 పాత రేషన్ కార్డ్ లలో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని తెలిపారు.అర్హత ఉండి రేషన్ కార్డ్ రానివారు,రేషన్ కార్డ్ ఉండి కుటుంబ సభ్యుల పేర్లు అందులో లేనివారు చింతించ వలసిన పనిలేదని అన్నారు.అలాంటి వారు మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో గత పది సంవత్సరాల కాలంలో ఒక్క నూతన రేషన్ కార్డ్ రాలేదని ఆయన విమర్శించారు.కనీసం ఉన్న రేషన్ కార్డ్ లలో ఒక్క కుటుంబ సభ్యుని పేరు కూడా చేర్చలేదని ఆయన తెలిపారు.ఆ కాలంలో చాలా రేషన్ కార్డ్ లు కారణం లేకుండానే తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జుక్కల్ నియోజక వర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ పేదలకు రేషన్ కార్డ్ లు,ఇందిరమ్మ ఇళ్లు,రోడ్లు,విద్యా,విద్యా సౌకర్యాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్న కొడప్ గల్ సింగిల్ విండో చైర్మన్ గోకన్ గంగాగౌడ్, కాటేపల్లి శ్రీ కృష్ణయాదవ సంఘం అధ్యక్షులు చౌటకురి శంకర్, కాంగ్రెస్ నాయకులు పాండు నాయక్, భార్త్యా నాయక్,గురుదాస్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///