

ఉరవకొండ మన న్యూస్:అడిగిన సమాచారం ఒకటి ఇచ్చిన సమాచారం మరొకటి ఫిర్యాదుదారున్ని అధికారులు తప్పుదావ పట్టించిన వైనం.ఇది రెవెన్యూఅధికారుల మాయాజాలం.
అన్యాయం జరిగిందని దిద్దుబాటు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారున్ని తాసిల్దార్ తప్పు దోవ పట్టించడమే కాకుండా జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించి రెవెన్యూ అధికారులు మాయాజాలం చేశారు . వివరాలు ఇలా ఉన్నాయి విడపనకల్ మండలం, వేలుపు మడుగు గ్రామం సర్వేనెంబర్ 332 డి లో ఉన్న భూమి 3.75 సెంట్లు సంబంధించిన వారసత్వ హక్కులు కలిగి ఉన్నారు. కొట్టాలపల్లి గ్రామనికి చెందిన కురువ లక్ష్మీనారాయణ భూ ఆధారిత రికార్డులతో సహ జిల్లా కలెక్టర్ కు 6/5/2025 తేదీన జరిగిన పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు చేయడం అయినది. ఫిర్యాదుదారుడు 332D సర్వేనెంబర్ లో విస్తీర్ణం గురించి తగా విషయంపై ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ భూమిని కొటాలపల్లి గ్రామానికి చెందిన మోదుపల్లి సాలమ్మ మనవడు మోదుపల్లి చంద్రబాబు రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసుకున్నారని ఆరోపించారు అడ్డుగోలుగా 09/09/2024, మ్యూటేషన్ జరిగిందని ఫిర్యాదీ దారుడు ఆరోపించారు అయితే విడపనకల్ తాసిల్దార్ భూమికి సంబంధించిన విషయంపై 332D విస్తీర్ణం 3.75 లకు పైకి 1. 97 సెంట్లు భూమి అప్పట్లో మోదుపల్లి సుబ్బన్న గారి భార్య మోదుపల్లి సాలమ్మ కొట్టాలపల్లికి చెందిన బడుగోర్ల వనురప్ప భార్య నాగమ్మ రాయించు కొని రిజిస్టర్ చేసినట్లు తాసిల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్లో పేర్కొన్నారు.
నిజానికి ఫిర్యాదారుడు ఇచ్చిన ఫిర్యాదులో 332 సర్వే నంబర్ల కు సంబంధించిన తాసిల్దారు ఇంద్రజాలం ప్రదర్శిస్తూ 332D సమాచారం తప్పుగా ఇచ్చారు 1.97 ఎకరాల బదులు ఎకరా 87 సెంట్ల భూమి ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారు డాక్యుమెంట్ నెంబర్ 1192/1982 తేదీ, 13,08,,1982 పరిశీలిస్తే 1.97 ఉంది మరి 1.87 ఉన్నట్లు రికార్డులు పరిశీలించకుండా తప్పుడు సమాచారం జిల్లా అధికారులకు అందించడంలో తాసిల్దార్ మతలబు ఏమిటో అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న?!, 332D సమాచారం ప్రకారం చూస్తే ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా , 1.97 ఎకరాలకు బదులు 1.87 అని ఎకరాల తప్పుడు సమాచారం ఇచ్చాడు ఫిర్యాదుదారున్ని ప్రకారం ఎకరా 87 1/2 ఉండగా తికమక అసంబద్ధంగా సమాచారము ఇచ్చి ఫిర్యాదీ దారున్ని ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు పైగా నిజా, నిజాలు పరిశీలించకుండా రికార్డులో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా పేర్కొన్నారు ఆర్డీవో ఎదుట అప్పీలు దరఖాస్తు చేసుకోవాలని విడపనకల్ తాసిల్దారు ఇచ్చిన ఎండార్స్మెంట్లో పేర్కొన్నట్లు బాధిత ఫిర్యాదు దారుడు
ఏ కరవు పెట్టారు. తప్పుడు సమాచారం అటు ఫిర్యాదుదారునికి ఇటు జిల్లా కలెక్టర్ ను తప్పదోవ పట్టించే విధంగా వ్యవహరించిన తాసిల్దార్ పై ఉన్నత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత ఫిర్యాదీ దారుడు లక్ష్మీనారాయణ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించినా స్థానిక తాసిల్దార్ ప్రజా సమస్యల వేదికలో సమస్యలపట్ల స్పందించడం లేదు తద్వారా సమస్యల పరిష్కారం లక్ష్యం నెరవేరటం లేదని పలువురు లబ్దిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.