

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా కుడి కాలువ కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లి కి పూజలు నిర్వహించి నీటి విడుదల చేయడం జరిగినది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ర్యాలంపాడు రిజర్వాయర్ పంప్ హౌస్ ను ప్రారంభించి రైతులకు సకాలంలో నీటిని అందించే చేశారు. రైతులు సమన్వయంతో నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులకు వ్యవసాయానికి అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, చేయడం వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులు పండించిన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు విధంగా వరి కొనుగోలు కేంద్రాలను చేయడం జరిగినది. ప్రస్తుతం వానకాలం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కావడం జరుగుతుంది కావున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు గాని ఈ సంవత్సరం నీటిని విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి , నాయకులు శ్రీనివాస్ రెడ్డి,డి.ఆర్ విజయ్, డి.వై రామన్న, శ్రీరాములు, రాముడు, విజయ్ రెడ్డి, సంగాల నర్సింహులు, తిమ్మప్ప, యువ నాయకులు పురుషోత్తం రెడ్డి, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
