పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

మన న్యూస్ :తిరుపతి :– తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ . మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం ముత్యాల రెడ్డి పల్లి ఉల్లి పట్టెడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పార్టీల కేతహితంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినట్లు చెప్పారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారందరికీ త్వరలో ఇల్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, క్లస్టర్ ఇంచార్జ్ సూరా సుధాకర్ రెడ్డి, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్, కొట్టే హేమంత్ రాయల్, గంగులయ్య వెంకటేష్ యాదవ్ కొండారెడ్డి రమేష్ ప్రవీణ్ మస్తానమ్మ పద్మ తరుణ్ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

Related Posts

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..