అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట, జూన్ 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట,అధిక ధరలుకు ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతి రావు ఎరువుల దుకాణాల డీలర్లను హెచ్చరించారు. ఆదివారం నాడు ఆయన పాచిపెంట గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని రైతులు రైతులకు ఉపయోగము లేని ఎరువులను బలవంతంగా అంటగట్ట రాదని వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు సూచించారు. స్థానిక కృష్ణ ఎరువుల డిపో లో ఎరువుల పంపిణీ పరిశీలించారు.ఈ సందర్భంగా పి కొనవలస రైతు కొట్టాడా సత్యనారాయణ మాట్లాడుతూ ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని దుకాణదారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎరువులతో పాటు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని కోరారు.రైతుకు ఇచ్చే ఎరువుల ఉపయోగాలను కూడా రైతుకు తెలియజేయాలని రైతు ఏ పంటకు, ఏ ఎరువు తీసుకు వెళుతున్నాడో కనుక్కొని సరియైన ఎరువులు మాత్రమే రైతుకు అందజేయాలని సూచించారు.రికార్డులు పక్కాగా నిర్వహించాలని లేనియెడల చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు హెచ్చరించారు.

  • Related Posts

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మండలంలోని రామానాయుడు పల్లి వద్ద రాష్ట్రప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు రకాల పండ్లు , పూలు తో చేసిన గజమాలలను క్రేన్ తో ఆయనకు…

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    గూడూరు మన న్యూస్ :- ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ లో జరిగిన పత్రిక సమావేశం చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఇంతగా మా విద్యా సంస్థలను ఆదరించి మా ఉన్నతి లో భాగమైన పత్రిక మిత్రులకు, విద్యార్థులకు వారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు