నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవ్య మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగు రైతులకు నష్టాలు లేకుండా ఆదాయాన్ని అందించగల మగ్గమైన పంట. 1993లో రూపొందించిన ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వివిధ సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తోంది,” అని పేర్కొన్నారు.జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ కంపెనీలు నర్సరీల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తాయని,అంతేకాక తగిన సాంకేతిక సలహాలు అందించి, పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేసి,ప్రతి నెలా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు గెలలను కొనుగోలు చేస్తాయని తెలిపారు.రైతుల ఖాతాల్లోకి అమ్మకానికి వచ్చిన డబ్బులు 14 రోజుల్లో జమచేయబడతాయని వివరించారు.NMEO-OP పథకం ప్రయోజనాలు:
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ ఆయిల్ పామ్ అభివృద్ధి మిషన్ (NMEO-OP) పథకం కింద నాలుగేళ్లపాటు వివిధ రాయితీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో ఎకరానికి రూ.50,918/- వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తారు. మొక్కల కొరకు రైతు ఒక్కొక్కటి ₹20 చొప్పున చెల్లించాలి.అలాగే బిందు సేద్యం పరికరాల ఏర్పాటు కోసం కూడా రైతులు కొంత వాటా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో ఉద్యాన అధికారి సుమన్,ఏఈఓ మధుసూదనరావు,ఫీల్డ్ ఆఫీసర్ హమీద్,గున్కుల్ సొసైటీ ఉపాధ్యక్షులు గొట్టం నర్సింలు,మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,హిందుస్థాన్ యూనిలీవర్ మేనేజర్ లతోపాటు గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక మస్య యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ…

    మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా :శనివారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..

    బలరామ్మూర్తి  త్వరగా కోలుకోవాలి..

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

    • By RAHEEM
    • June 29, 2025
    • 4 views
    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు