

వెదురుకుప్పం, మనన్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం.టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి,మండల టిడిపి ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్,స్థానిక సర్పంచ్ శ్రీనాథరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి,నియోజకవర్గం ఎస్సీ సెల్లు ఉపాధ్యక్షులు బి.ఎం.రవి,మాజీ సర్పంచ్ రాజారెడ్డి,మాజీ సర్పంచ్ బాబురెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, బూత్ కమిటీ కన్వీనర్ వెంకటరెడ్డి, జక్కదోన గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మాధవ నాయుడు,దామోదరరెడ్డి, మేఘనాధ రెడ్డి, దొరకనాథ్ రెడ్డి,లోకేష్ యాదవ్, విష్ణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.