అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ….. కావలి ఎమ్మేల్యే దగుమాటి కృష్ణా రెడ్డి

  • అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేస్తాం,
  • ఒక సేవకుడిగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను
  • కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి

కావలి,మనన్యూస్, నవంబర్ 25 :- అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నివాసం వుంటూ, ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు నివాసం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయంలో నివాస స్థలం, కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. కావలి అభివృద్ధికి నిరంతరం నాయకుడు గా కాకుండా సేవకుడు గా సేవ చేస్తానని తెలిపారు. నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జనసేన నాయకుడు పోబ్బా సాయి విఠల్, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి