అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ….. కావలి ఎమ్మేల్యే దగుమాటి కృష్ణా రెడ్డి

  • అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేస్తాం,
  • ఒక సేవకుడిగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను
  • కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి

కావలి,మనన్యూస్, నవంబర్ 25 :- అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నివాసం వుంటూ, ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు నివాసం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయంలో నివాస స్థలం, కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. కావలి అభివృద్ధికి నిరంతరం నాయకుడు గా కాకుండా సేవకుడు గా సేవ చేస్తానని తెలిపారు. నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జనసేన నాయకుడు పోబ్బా సాయి విఠల్, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు