

అట్లూరు జూన్ 20: మన న్యూస్: రెవిన్యూ శాఖ ఏర్పడి నేటికీ రెండు శతాబ్దాలు పైబడిందని ఆనాటి బ్రిటిష్ వ్యవస్థ కు ముందు నుండి నేటి వరకు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సేవలు అందిస్తుందని అట్లూరు తహాశీల్దార్ పి. సుబ్బ లక్ష్మమ్మ. పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు “రెవిన్యూ డే” ను పురస్కరించుకొని అట్లూరు తహాశీల్దార్ కార్యాలయం నుండి అట్లూరు గ్రామం వరకు రెవిన్యూ ఉద్యోగులు. డీలర్లు. ప్రభుత్వ అధికారులు. ప్రజాప్రతినిధులు తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కార్యాలయం ఆవరణము నందు సభను ఉద్దేశించి తహాశీల్దారు పి. సుబ్బ లక్ష్మమ్మ. మాట్లాడుతూ రెవిన్యూ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని మనిషి యొక్క పుట్టుక నుండి మరణం వరకు రెవిన్యూ వ్యవస్థ తో ముడిపడి ఉందని రైతులకు ప్రజలకు ఎలాంటి సేవలు అందాలన్నా రెవిన్యూ శాఖ కీలకమని ఆమె తెలిపారు. ఆపత్కాలంలో వరదలు. విపత్తులు. అగ్ని ప్రమాదాలు. సంభవించినప్పుడు రెవెన్యూ సేవలు ఎంతో ప్రాధాన్యతతో కలిగి ఉంటాయని ప్రజలు, రైతులు రెవెన్యూ శాఖ అధికారులకు సహకరించి సేవలు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాపుదుప్పు మల్లికార్జున రెడ్డి,తంబళ్లగొంది పెద్ద మునిరెడ్డి, నాయకులు పోతిరెడ్డి రెడ్డయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, సర్పంచ్ సుధా,అల్లం వెంకటసుబ్బయ్య, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరమణ. మండల సర్వేయర్ వేణుగోపాల్. జూనియర్ అసిస్టెంట్ వేణు గోపాల్. బండెయ్య. సర్వేర్లు వీఆర్వోలు వీఆర్ఏలు. రైతులు డీలర్లు. తదితరులు పాల్గొన్నారు.
