ప్రైవేట్ కార్పొరేట్ విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలి– AISA–బండి అనిల్ కుమార్

టై బెల్ట్ లు, మెటీరియల్, పేరుతో వేల రూపాయలు వసూలు.

బద్వేల్: జూన్ 20: మన న్యూస్ :కడప జిల్లాలో వున్నా కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు టై, బెల్ట్ మెటీరియల్, ల వంటి వాటి పేరుతో, వేలాది రూపాయలు,పిల్లల తల్లి తండ్రుల దగ్గర నుండి వాసులు చేస్తున్నారని, అలాగే IIT. NEET.JEE కోచింగ్ ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలతో పాటు ప్రత్యక్ష దాడులకు సిద్ధం అని, AISA జిల్లా కన్వీనర్. బి. అనిల్ కుమార్ పేర్కొన్నారు,ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులతో పాటు మెటీరియల్ తో పాటు టైం బెల్ట్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అయితే ఇదే తరుణంలో జిల్లాలో కొత్త కొత్తగా పుట్టగొడుగుల్లా వీధి వీధికి ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని వారికి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వీటన్నిటిని విద్యాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి కల్లబొల్లి మాటలతో వారి రక్తాన్ని జలగల్లా పట్టిపీడుస్తున్నారని సరైనటువంటి ఫెసిలిటీసు సరైనటువంటి క్లాస్ రూమ్స్ అలాగే కనీస గ్రౌండ్ కూడా లేనటువంటి విద్యాసంస్థలు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఐఐటి నీటి జేఈఈ అని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా వారిని హెచ్చరిస్తున్నామని టై,బెల్టు పేరుతో మెటీరియల్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తే ప్రత్యక్ష దాడులు కైనా సిద్ధమని హెచ్చరించారు. అదేవిధంగా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు వారి నిర్లక్ష్యంతో అనేక సంఘటనలు జరుగుతున్నాయని అయితే సరైనటువంటి పర్యవేక్షణ లేని విద్యాసంస్థలు ను రద్దు చేయాలని లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే ఇప్పటికే మొదలైనటువంటి అకాడమిక్ ఇయర్ లో ప్రతి స్కూలు తనిఖీ చేసి మెటీరియల్ టై బెల్టు లు ఎంత అమ్మారు అనేది విచారణ చేపట్టాలని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో AISA నాయకులు శంకర్ బన్నీ శాలెం . జేమ్స్ అంజి, లు పాల్గొన్నారు.

  • Related Posts

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు