అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలి : అగరంపల్లి గ్రామస్తులు.

ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాణిపాకం గ్రామపంచాయతీ పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించగా ఐరాల మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయతీకి అప్పజెప్పడం జరిగింది. అయితే కొంతమంది కబ్జాదారులు తమ భూమి ఆనుకుని ఉన్న భూమిని యదేచ్చగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కలెక్టర కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ కు అలాగే జిల్లా పంచాయతీ అధికారి కి కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు జిల్లా రెవిన్యూ అధికారి మోహన్ కుమార్ ఐరాల మండల తాసిల్దార్ మహేష్ కు వెంటనే ఆక్రమణల తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు .ఈ మేరకు ఐరాల మండల తాసిల్దార్ మహేష్ కుమార్ తన సిబ్బందితో కాణిపాకం పంచాయితీ స్థలానికి వెళ్లి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కాణిపాకం గ్రామస్తులు ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పట్టాభి రెడ్డి, జయచంద్రారెడ్డి ఎల్. గోపీనాథ్, సురేష్ రెడ్డి పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు