అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సాయం బాధితులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తుందని హెల్పింగ్ యూత్ సభ్యులు అన్నారు. ఏలేశ్వరం 1 వార్డు శాంతినగర్ కాలనీ చెందిన దెయ్యాల అప్పలరాజు పూరిఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిస్థాయిలో ఇల్లు మొత్తం కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డుపై ఉన్న బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, వంట సామాగ్రి, ఫ్యాన్ తో పాటు, రూ 1వేలు ఆర్థిక సహాయన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాధితులను కొంతమేర ఆదుకునే అందుకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎల్లప్పుడూ ముందుంటుంది అన్నారు. బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు ముందుకు రావాలని కోరారు. అగ్నిప్రమాదం సంభవించడం వల్ల బాధితులకు ఆస్తి నష్టం జరిగిందని పేదలను ఆదుకుని వారిని ఆర్థికంగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో . కోక వెంకటేష్, రామ్ లాల్, పెండ్యాల రాజు, ఎం స్వరూపు, ఎస్.కెఅలీషా, ఎస్.కె అలీ, కేలం దుర్గాప్రసాద్, హెల్పింగ్ సభ్యులు పాల్గొన్నారు

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..