

మన న్యూస్, మనుబోలు:*మనుబోలు మండల కేంద్రంలో శ్రీమతి కాకాణి పూజితమ్మ పర్యటన*మహానేత వైయస్సార్ విగ్రహానికి నివాళులు.*మనుబోలు మండలంలో కాకాణి వారసురాలికి అందిన ఘన స్వాగతం.*పూజితమ్మను కలవడానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు.*పిడూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకాణి పూజితమ్మసర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో బుధవారం పర్యటించిన మాజీ మంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితమ్మ.మనుబోలు మండల కేంద్రంలో సాయిబాబా గుడిలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కాకాణి పూజితమ్మపూజితమ్మ మీడియాతో మాట్లాడుతూ…… కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నా, మా కుటుంబానికి అండగా నిలుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులకు రుణపడి ఉంటాం అని అన్నారు. నాన్నను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి, నిప్పుల కొలిమిలో పెట్టారు.. న్యాయం మన వైపు ఉంది, స్వచ్ఛ బంగారంలా నాన్న తిరిగి వస్తారు అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై జరిగే అన్యాయాలను, అక్రమాలను ఉపేక్షించం అని అన్నారు.కోర్టులపై నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అని అన్నారు.దేవుడు ఉన్నాడు..మంచి రోజులు వస్తాయి… అని అన్నారు.యస్.సి., యస్.టి. అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారు అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ, బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు అని అన్నారు.ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలియకుండా చేయడానికి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు అని అన్నారు.ప్రజలను మభ్య పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని అన్నారు.ప్రజలు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే, కేసులు పెడతామని భయపెడుతున్నారు అని అన్నారు.ప్రజలను మోసం చేస్తాం, ప్రశ్నిస్తే ప్రజలను సైతం జైలులో పెడుతామన్న చందాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే స్వేచ్ఛ మీడియా ప్రతినిధులకు సైతం లేకపోవడం దౌర్భాగ్యం.. అని అన్నారు.సాక్షి విలేకరి కొమ్మినేని శ్రీనివాసులు గారిపై, కావలిలో విలేకరులపై పెట్టిన అక్రమ కేసులే ఉదాహరణలు అని అన్నారు.జిల్లాలో నేడు ప్రశ్నించే గోవర్ధన్ రెడ్డి లేరు, ఎవరైనా ప్రశ్నిస్తే విచ్చలవిడిగా కేసులు పెడుతాం.. మమ్మల్ని ఎవరు అడుగుతారనే ధీమా! వాళ్లలో ఉంది, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం అని అన్నారు. పెద్ద కుటుంబమైన సర్వేపల్లి నియోజకవర్గమంతా మాకు అండగా నిలబడి ఉంది అని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మాని, ప్రజలకు న్యాయం చెయ్యండి అని అన్నారు.మనుబోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు.


