

మన న్యూస్ ,నెల్లూరు : ది పాలనలో అభివృద్ధి పరుగులు* నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు..* భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు..* మంత్రి నారాయణ సార్ వ్యూహాత్మక ఆలోచనలతోనే నెల్లూరు అభివృద్ధికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నెల్లూరు గోమతీ నగర్ లోని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను టిడిపి శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు.జేజే నినాదాలతో హోరెత్తిన మంత్రి క్యాంపు కార్యాలయం మారుమోగింది. 12 నెలల ప్రజారంజక పాలనకు 12 కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టిన సీటీ టీడీపీ నేతలు. హామీల అమలుతో రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఫుల్ జోష్ లో టిడిపి క్యాడర్ కనిపించింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ….. పండుగలా విజయోత్సవ సంబరాలు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ ప్రజా పాలనకు నేటితో ఏడాది పూర్తి సందర్భంగా ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తైందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతీ హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుపడి సొంతనిధులతో సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అని కొనియాడారు. ప్రజలతో పాటు కార్యకర్తల మనసులు చూరగొంటున్న మహా నేత మంత్రి నారాయణ అని అభివర్ణించారు. సిటీలో 46 పార్కుల ఆధునీకరణ, 54 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. భగత్ సింగ్ కాలనీ వాసుల కల సాకారం చేసారని ధన్యవాదాలు తెలిపారు. 1400 కుటుంబాలకు శాశ్వత ఇంటిపట్టాలు త్వరలో అందుకోబోతున్నారని చెప్పారు . మూతపడ్డ వీఆర్సీ హై స్కూల్ పై మంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీఆర్సీ సిద్ధమౌతోందని తెలియజేశారు. పేదపిల్లలకు కార్పొరేట్ చదువులను ఉచితంగా అందించాలన్నది నారాయణ సార్ సంకల్పం అని చెప్పారు. అభివృద్ధి అంటే నారాయణ అనేలా మంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. మంత్రి నారాయణ సార్ ఆధ్వర్యంలో నెల్లూరు సీటీ రాష్ట్రానికే రొల్ మోడల్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ తాళ్ళపాక అనూరాధ మాట్లాడుతూ…. చెప్పాడంటే చేస్తారు అనేందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అభినందించారు. 2014 లోనే మంత్రిగా 5250 కోట్లతోనెల్లూరు సిటీ ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అభివృద్ధి చేసారని చెప్పారు. మంచినీటి పధకాలు ,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల రూపకర్తగా ప్రజల మన్ననలు పొందారన్నారు. గత ప్రభుత్వం కక్షతో ఆపేసిన అభివృద్ధి పనులన్నీ మంత్రిగారు పునః ప్రారంభించారని తెలిపారు. అన్నా క్యాంటిన్లు ,ఏ సి బస్ షెల్టర్లు తిరిగి మంత్రి నారాయణ పునః ప్రారంభించారన్నారు. ప్రజాభీష్టం మేరకు పనులు చేస్తున్న నేతా మంత్రి అని అభివర్ణించారు. నారాయణ సార్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని స్పష్టం చేశారు. ఏడాదికి పదికోట్ల సొంత నిధిని కార్యకర్తలకోసం వెచ్చిస్తున్న మహోన్నత నేత నారాయణ సార్ అని కొనియాడారు. మంత్రి నారాయణ సార్ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కావటం మా అందరి అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు మాట్లాడుతూ రాక్షస పాలనను అంతమొందించి ఏడాది కాలం అయిందన్నారు. పారదర్శకతో సీఎం చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. జగన్ జమానాలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని ఆగ్రహించారు. సీఎం అపార అనుభవంతో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతోందన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్ మంత్రి నారాయణ సార్ అని స్పష్టం చేశారు. హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుండటంతో ప్రజాదరణ పెరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి , మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి , డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు .


డ



