

మన న్యూస్, గూడూరు :కూటమి ప్రభుత్వ చారిత్రిక విజయానికి ఏడాది పూర్తి.గూడూరు లో *అంబరాన్ని అంటిన కూటమి నాయకుల సంబరాలు.*అదరహో… కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా పై విజయోత్సవ ర్యాలీ.*కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీ *జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే.*తెలుగు తమ్ముళ్ల తో కిక్కరించిన గూడూరు పట్టణం.*పల్లెల నుండి తరలి వచ్చిన తెలుగు తముళ్లు.* గూడూరు పట్టణం పసుపు మయం.*భారీ గజ మాలలతో, పూల వర్షం తో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు ఘన సత్కారం.*బాణా సంచా వేడుకలతో దద్దరిల్లిన గూడూరు పట్టణం.*నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ .*రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేసి అందరినికాపాడుకుంటాం:ఎమ్మెల్యే*కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుంది.*ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభించాం.*మోడీ , చంద్రబాబు, పవన్ నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్.దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం.*బాబు సూపర్ సిక్స్ లో ‘తల్లికి వందనం’ హామీ నిలబెట్టుకున్నాం.*ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’*సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి.*ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉంది.*కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది కాబట్టే ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మారధం పడుతున్నారని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురువారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ ర్యాలీనిఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. గూడూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఆయన నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో కలసి ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వరకు నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ కూడలి వద్ద నున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంఘం థియేటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వేలాది మంది టిడిపి నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు తో ఓపెన్ టాప్ జిప్ లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే పై పూల వర్షం కురుపించి భారీ గజా మాలల తో సత్కరించారు. బాణా సంచా కాల్చుతూ డిజే పాటల తో పసుపు జెండాలతో గూడూరు పట్టణం దద్దరిల్లింది.ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేస్తూ నూతన ఉతేజం నింపారు.ఈ ర్యాలీ మార్గంలో కూటమి పార్టీల జెండాలు, ప్లకార్డులతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయోత్సవ ర్యాలీ ఆదరహోలా.. అదిరిపోయింది.అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను వివరించారు.ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను రూ.4 వేలు చేసింది అన్నారు. ఉచిత గ్యాస్ అందిస్తుందన్నారు. తల్లికి వందనంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటినుండి అమల్లోకి తీసుకువచ్చే ప్రణాళికలను ఈపాటికి సిద్ధం చేశారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువస్తున్నాయన్నారు. అదే విధంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం గూడూరులో ప్రజల మద్దతును గెలుచుకుందని, తమ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ సంవత్సరకాలంలో రాష్ట్రమంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారుచేసుకున్నాము.గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది.గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసినా, తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రమంతకూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ, దిశా మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తుకోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు:ఎమ్మెల్యే.ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని, ఇది చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. ‘ వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసింది. పింఛన్లు ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ ప్రతినెలా ఒకటో తేదీకే అందేలా చూస్తోంది. వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల దెబ్బతిన్న రాష్ర్టాన్ని, అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు.’ అని తెలిపారు. చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం. చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందనీ ఎమ్మెల్యే తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం చేసిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ విజయోత్సవ ర్యాలీ లో టిడిపి అగ్ర నేత తానంకి నానాజీ,శీలం కిరణ్ కుమార్, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇంచార్జి పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి, చిల్లకూరు దశరధ రామిరెడ్డి,పలగాటి భాస్కర్ రెడ్డి, పాదార్తి కోటేశ్వరరెడ్డి, విజయ్ శేఖర్ రెడ్డి,పలగాటి జితేంద్ర రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, టిడిపి మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, ఉచ్చురు వెంకటేశ్వర్ల రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు మరియు నాయుకులు షేక్ జలిల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, బిల్లు చెంచు రామయ్య, కొకర్ల మధుయాదవ్, పల్లె మల్లు వెంకట కృష్ణా రెడ్డి, కోటి, మురళి, మర్రి పోలయ్య, మరియు మట్టం శ్రావణి, బిందు రెడ్డి, భారతి టిడిపి నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










