

మన న్యూస్, కోవూరు, జూన్ 10:- జిల్లాలో ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- దివ్యాంగులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది- జిల్లాలో ఇప్పటివరకు 950 మందికి ట్రై సైకిళ్ల అందజేతదివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం ఉంటుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 12 మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ తరపున ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీడియాతో మాట్లాడుతూ….. జిల్లాలో ఇప్పటివరకు 950 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించామని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. విపిఆర్ నేత్ర అన్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తాను, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎనలేని సంతోషాన్ని పొందుతున్నట్లు పేర్కొన్నారు. నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశి రెడ్డి, ఆవుల వాసు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.



