తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠంలో గంజాయి దొరకటం దురదృష్టకరం!

మనన్యూస్, తవణంపల్లె నవంబర్-23:- పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం, బాధాకరం. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకానితనం వలన, పర్యవేక్షణ లోపం వలన ఈరోజు విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల హాస్టల్ లో గంజాయి దొరకటం బాధాకరం. సాక్షాత్తు రాష్ట్రపతి విసిటర్ గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో గంజాయి స్వైర విహారం చేయటం దురదృష్టకరం. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ చాన్సిలర్ గా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం పవిత్రతను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దెబ్బతీశారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్ ల పైన, విద్యార్థుల పైన పర్యవేక్షణ నిఘా కొరవడింది. పవిత్రమైన విశ్వవిద్యాలయం, ఈ విధంగా గంజాయి నిలయంగా మారిపోవడం విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చింది. సాక్షాత్తు విసి తన యొక్క ఛాంబర్ లో కూర్చొని తంబాకు, ఖైని, గుట్కా తింటూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట దిగజారుస్తున్నారు. విద్యార్థులకు గంజాయి ఎక్కడ నుండి సరఫరా అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతుంది, గంజాయి సరఫరా చేసే ముఠాను ఉక్కు పాదంతో అణిచివేయాలి. విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని గంజాయి అమ్ముతున్నటువంటి గంజాయి సరఫరాదారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.