వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ ప్రసన్న…… తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి

మన న్యూస్ ,కోవూరు:* మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు మాటలపై కోవూరు టీడీపీ నేతల ధ్వజం* వేమిరెడ్డి దంపతులను విమర్శించే స్థాయి నీకు లేదు* గ్రావెల్‌, మద్యం, ఇసుక కుంభకోణాలు చేసిన నువ్వా మాట్లాడేది* బ్రోకర్లంతా నీ చుట్టూనే ఉన్నారు, మా దగ్గర పని చేసే నాయకులున్నారు* వేమిరెడ్డి దంపతుల సమక్షంలో కోవూరు అభివృద్ది* ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది* హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందిమాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు మాటలపై కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రసన్నకుమార్‌పై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బ్రోకర్లంతా ఆయన చుట్టూనే ఉన్నారని, పనిచేసే నాయకులు, కార్యకర్తలు వేమిరెడ్డి దంపతుల నడుస్తున్నారని వివరించారు. గురువారం ఈ మేరకు కోవూరులోని కల్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోవూరు మండలపార్టీ అధ్యక్షలు కొల్లారెడ్డి సుధాకర్‌రెడ్డి, కొడవలూరు మండలపార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్, ఎస్సీ సెల్‌ నాయకుడు దారా విజయ బాబు, టీడీపీ సీనియర్‌ నాయకులు పిఎల్‌ రావు, చెంచు కిషోర్‌, ఇంతా మల్లారెడ్డి, ఇందుకూరుపేట సీనియర్‌ నాయకులు వీరేంద్ర, జనసేన నాయకులు అశోక్ కుమార్ వంటివారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మతిభ్రమించి మాట్లాడారని విమర్శించారు. 2019లో ఎన్నికలు చేయడానికి కూడా డబ్బు లేక అప్పుల పాలైన నీకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. అలాంటిది వేమిరెడ్డి దంపతులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అప్పుల పాలైన ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుతం 50 కోట్లతో భవనం నిర్మిస్తున్నాడని, ఎన్ని అక్రమాలు చేస్తే ఇంత భవనం నిర్మిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ప్రసన్న భాష, యాస పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు సాగుతున్నారన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమకు క్రమశిక్షణ నేర్పారని, అందుకే తాము సైలెంట్‌గా ఉంటున్నామన్నారు. ప్రసన్న లాంటి బ్రోకర్ రాజకీయాలు తమకు చేతకావని చెప్పారు. పార్టీ ఇంచార్జిలు గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న సంగతి గమనించాలని, కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, నాయకులను కాపాడుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఘాటుగా విమర్శించారు. గతంలో చైర్మన్ పదవులను అమ్ముకున్న చరిత్ర ప్రసన్నకుమార్ రెడ్డిదని ధ్వజమెత్తారు. ఈవీఎంలు అంటున్న ప్రసన్నకుమార్.. 2009, 2012, 2019 లో ఎలా గెలిచారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పారు. వేమిరెడ్డి దంపతులను విమర్శిస్తే.. తాము కూడా సరైన రీతిలో ఎదురుదాడికి దిగుతామన్నారు. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే ఉందని, అందుకే 2024లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. వెన్నుపోటు పొడిచిన వాళ్లే వెన్నుపోటు దినంనిర్వహించడం హాస్యాస్పదమన్నారు. వేమిరెడ్డి దంపతుల మీద అవాకులు, చెవాకులు పేలితే సరైన జవాబు ఇస్తామన్నారు. కోవూరులో పాత, కొత్త నాయకులు కలిసి పనిచేస్తున్నారని, వారందరికీ వేమిరెడ్డి దంపతులు అండగా ఉన్నారన్నారు. వైసీపీకి ప్రజలు రెడ్ లైట్ వేశారు కాబట్టే ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. నమ్మి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు కి వెన్నుపోటు పొడిచిన చరిత్ర ప్రసన్నకుమార్‌రెడ్డిదేనని గుర్తు చేశారు. వైసిపి అంటే బందిపోటు పార్టీ అని, గత ఐదేళ్లు బందిపోట్ల పాలన చేసిన పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం పింఛన్లను 3000 నుంచి 4 వేలకు, 6000 కు పెంచి అందిస్తోందని చెప్పారు. 2024 ఎన్నికలకు ముందే మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి పాలనలో ఒక్క వ్యక్తికి కూడా పింఛను తొలగించిన చరిత్ర లేదన్నారు.వేమిరెడ్డి దంపతులు.. దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ దగ్గర నుంచి విపిఆర్ వాటర్ ప్లాంట్లు, రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నారు. సొంత చెల్లికి, తల్లికి, నాయకులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉందని చెప్పారు. గ్రామాల్లో ప్రసన్నకుమార్ రెడ్డి అక్రమ కలెక్షన్లు తట్టుకోలేక వైసీపీ కార్యకర్తలు పార్టీ మారుతున్నారని చెప్పారు. పెన్నా కరకట్ట మొత్తాన్ని దోచుకుతిన్న ప్రసన్న కుమార్ రెడ్డి నీచపు బతుకు నెల్లూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోని ప్రసన్న కుమార్ రెడ్డి.. ఆయన్ను విమర్శించడం సరికాదని చెప్పారు. మరొకసారి వేమిరెడ్డి దంపతులను గాని, కూటమి ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే.. తాము కూడా ప్రసన్న చిట్టా విప్పుతామని హెచ్చరికలు చేశారు. కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్‌ జెట్టి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ నాయకులు బెజవాడ వంశీరెడ్డి, బుచ్చి టౌన్‌ పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, ఇందుకూరుపేట మండలపార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్‌రెడ్డి, విడవలూరు మండలాధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి, మాజీ మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    పుత్తూరు , మన న్యూస్, జూన్ 8: అఖిల భారత క్షత్రియ మహాసభ – 1897 యువ విభాగం జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు కోనేటి…

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    మనుబోలు, నెల్లూరు జిల్లా , మన న్యూస్:  తిరుపతి జిల్లాలోని మనుబోలు మండలం లో జరిగిన లోటస్ వ్యాలీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కుటుంబ సమేతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ