

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపు డీలర్ల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవరపాలెం గ్రామ రేషన్ షాపును ప్రారంభించి, గ్రామస్థులకు రేషన్ సరుకులను అందజేసిన నెల్లూరు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ , రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ దేవస్థాన మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు కుర్ర శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, తాటిపర్తి బాబు, ముత్యంశెట్టి శీనయ్య, గుంజి అంకులు, టి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
