

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగసీ వ్యర్థాలను బయో-మైనింగ్ చూసే పనులను ఆదివారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగసీ వ్యర్థాలను బయో మైనింగ్ ద్వారా రాబోయే తొమ్మిది నెలల్లో పూర్తిగా ఉన్న వ్యర్థాలను తొలగించడం శుభపరిణామం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ దేవస్థాన మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్,టిడిపి నాయకులు మలినేని వెంకయ్య నాయుడు, చండి మురళి,గిరి, బాలు వెంకట రమణయ్య, టి . విజయ్, చండీ సునీల్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


