విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం……. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ‌.

మన న్యూస్, నెల్లూరు :ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించాలని ,విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించగలమని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు.నెల్లూరు టౌన్ హాల్లో శనివారం జరిగిన నూర్ భాషా (దూదేకుల )బీసీ, ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీద మస్తాన్ రావు మాట్లాడుతూ …….ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకొని చదువుకున్న పాఠశాలకు ,గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నూరు భాషా సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయం అని తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో నూరు బాషా సంఘం వారు విద్యార్థులకు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.అలాగే పదవ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్ 900 మార్కులు సాధించిన విద్యార్థులకు బిఎంఆర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహాలను అందించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించారు. నూరు బాషా సంఘానికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి, సొంత భవనం కూడా ఏర్పాటుకు సహకరిస్తామని అని బీద మస్తాన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం అధ్యక్షులు షేక్ సలీం ,గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ పలువురు నూరు బాషా సంఘ నాయకులు ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు