

మన న్యూస్, నెల్లూరు :ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించాలని ,విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించగలమని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు.నెల్లూరు టౌన్ హాల్లో శనివారం జరిగిన నూర్ భాషా (దూదేకుల )బీసీ, ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీద మస్తాన్ రావు మాట్లాడుతూ …….ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకొని చదువుకున్న పాఠశాలకు ,గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నూరు భాషా సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయం అని తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో నూరు బాషా సంఘం వారు విద్యార్థులకు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.అలాగే పదవ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్ 900 మార్కులు సాధించిన విద్యార్థులకు బిఎంఆర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహాలను అందించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించారు. నూరు బాషా సంఘానికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి, సొంత భవనం కూడా ఏర్పాటుకు సహకరిస్తామని అని బీద మస్తాన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం అధ్యక్షులు షేక్ సలీం ,గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ పలువురు నూరు బాషా సంఘ నాయకులు ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



