బద్వేల్: మన న్యూస్: మే 31:
బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం, బద్వేల్ మండలాల లోని పలు విత్తన,ఎరువుల దుకాణాల్లో శనివారం ఏడీ ఏ ఎం నాగరాజ ,ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎడిఏ నాగరాజు మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తనాలు,ఎరువుల డీలర్ల దుకాణాలు తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.నకిలీ విత్తనాలు ,ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.నగదు బిల్లును రైతులకు ఇవ్వాలని సూచించారు.కాలం చెల్లిన మందులను,విత్తనాలను దుకాణాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు అన్నారు.ప్రతి రోజు స్టాక్ రిజిస్టర్,బిల్లు పుస్తకాలను అప్డేట్ చేసి ఉంచాలని తెలిపారు.ధరల పట్టిక,స్టాక్ బోర్డ్ అప్డేట్ చేయాలని సూచించారు.అనుమతి లేని వాటిని రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.లైసెన్స్ లు లేకుండా గ్రామాల్లో ఎవరైనా విత్తనాలు , ఎరువులు, పురుగు మందులు, విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.రైతు సోదరులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లో మాత్రమే,అనుమతి ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేసి నగదు బిల్లు పొంది భద్రపరచుకోవాలి అన్నారు.గ్రామాల్లో అనామక వ్యక్తులు ద్వారా కొనుగోలు చేసి మోసపోరాదని తెలిపారు.అటువంటి వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తుంటే వెంటనే మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకుని రావాలి అన్నారు.అటువంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు.
రైతులు కొన్న విత్తనాలను,ఎరువులను నాణ్యత పరీక్ష నిమిత్తం బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణ లోని సమగ్ర నాణ్యత పరీక్ష కేంద్రం లో ఉచితంగా పరీక్షించుకోవచ్చు.
రైతులు తప్పని సరిగా కొన్న విత్తనాలు,ఎరువులకు, పురుగు మందులు కు రసీదు తప్పని సరిగా తీసుకోవడం అవసరం.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *