క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి** క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేయాలి* ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు శాప్ ఛైర్మ‌న్ విన‌తి

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై రాష్ట‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగ‌ళ‌శారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వీసీకి విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఖేలో ఇండియా నిధుల‌ను వినియోగించి యూనివ‌ర్సిటీలో క్రీడారంగం అభివృద్ధికి కావాల్సిన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరారు. అలాగే శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడాకారుల‌కు హాస్ట‌ల్ స‌దుపాయం లేద‌ని, క్రీడా వ‌స‌తి గృహం ఏర్పాటుకు స‌హ‌కరించాల‌ని కాంక్షించారు. తిరుప‌తి వేదిక‌గా క్రీడారంగం అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, త్వ‌ర‌లో స్పోర్ట్స్ అకాడ‌మీని కూడా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. స్పోర్ట్స్ అథారిటీ, యూనివ‌ర్సిటీ స‌మిష్టి కృషితో తిరుప‌తి జిల్లాలో క్రీడారంగాన్ని ప‌రుగులు పెట్టించ‌వ‌చ్చ‌ని కోరారు. దీనిపై వీసీ అప్పారావు బ‌దులిస్తూ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో స్పోర్ట్స్ హాస్ట‌ల్‌కు అనుకూలంగా ఉన్న భ‌వ‌నాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అనుకూలంగా ఉంటే వాటిని త్వ‌రిత‌గ‌తిన ఆధునీకరించి డీఎస్ఏకు అంద‌జేస్తామ‌న్నారు. అలాగే క్రీడారంగాభివృద్ధికి యూనివ‌ర్సిటీ నుంచి పూర్తిస‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని శాప్ ఛైర్మ‌న్ కి వైస్ ఛాన్స‌ల‌ర్ హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీడీఓ స‌య్య‌ద్ సాహెబ్‌, ప‌లువురు అధ్యాప‌కులు పాల్గొన్నారు. *అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల విన‌తి..*తిరుపతి డీఎస్ఏకు విచ్చేసిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఉద్యోగుల సంఘ సభ్యులు శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో క‌లిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాప్ ఛైర్మన్ గార్కి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని శాప్ ఛైర్మన్ గారు వారికి హామీ ఇచ్చారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం