క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి** క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేయాలి* ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు శాప్ ఛైర్మ‌న్ విన‌తి

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై రాష్ట‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగ‌ళ‌శారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వీసీకి విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఖేలో ఇండియా నిధుల‌ను వినియోగించి యూనివ‌ర్సిటీలో క్రీడారంగం అభివృద్ధికి కావాల్సిన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరారు. అలాగే శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడాకారుల‌కు హాస్ట‌ల్ స‌దుపాయం లేద‌ని, క్రీడా వ‌స‌తి గృహం ఏర్పాటుకు స‌హ‌కరించాల‌ని కాంక్షించారు. తిరుప‌తి వేదిక‌గా క్రీడారంగం అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, త్వ‌ర‌లో స్పోర్ట్స్ అకాడ‌మీని కూడా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. స్పోర్ట్స్ అథారిటీ, యూనివ‌ర్సిటీ స‌మిష్టి కృషితో తిరుప‌తి జిల్లాలో క్రీడారంగాన్ని ప‌రుగులు పెట్టించ‌వ‌చ్చ‌ని కోరారు. దీనిపై వీసీ అప్పారావు బ‌దులిస్తూ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో స్పోర్ట్స్ హాస్ట‌ల్‌కు అనుకూలంగా ఉన్న భ‌వ‌నాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అనుకూలంగా ఉంటే వాటిని త్వ‌రిత‌గ‌తిన ఆధునీకరించి డీఎస్ఏకు అంద‌జేస్తామ‌న్నారు. అలాగే క్రీడారంగాభివృద్ధికి యూనివ‌ర్సిటీ నుంచి పూర్తిస‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని శాప్ ఛైర్మ‌న్ కి వైస్ ఛాన్స‌ల‌ర్ హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీడీఓ స‌య్య‌ద్ సాహెబ్‌, ప‌లువురు అధ్యాప‌కులు పాల్గొన్నారు. *అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల విన‌తి..*తిరుపతి డీఎస్ఏకు విచ్చేసిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఉద్యోగుల సంఘ సభ్యులు శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో క‌లిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాప్ ఛైర్మన్ గార్కి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని శాప్ ఛైర్మన్ గారు వారికి హామీ ఇచ్చారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..