మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం భజన కీర్తనలు,6 న ఎడ్లబండ్ల ప్రదర్శన,బోనాలు,భాగవత కార్యక్రమాలు,7న కుస్తీ పోటీలు రథోత్సవం ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు బంగ్లా ప్రవీణ్ కుమార్ తెలిపారు.నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.కుస్తీ పోటీలు,రథోత్సవం కు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *