

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 30: కడపజిల్లా సహకార బ్యాంకు ఛైర్మెన్ గా ఎంపిక అయిన మంచూరు సూర్య నారాయణ రెడ్డి ని తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా మంగళవారం ngo కాలనీ అయన స్వగృహం లో గజమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ ఆపదలో ఎవరు వున్నా నేను ఉన్నానంటూ ఆదుకునే మంచి వ్యక్తి తెలుగు దేశం పార్టీ లో కీలక పాత్ర పోషిస్తున్న సూర్యనారాయణ రెడ్డి ని జిల్లా సహకార బ్యాంకు ఛైర్మెన్ గా పార్టీ అధిష్టానం కు టిడిపి నియోజకవర్గ సమన్వయ కర్త రితీష్ రెడ్డి మాజీ ఎంఎల్ ఏ విజయమ్మలు సిఫారసు చేసి ఆయనకు జిల్లా పదవి దక్కేలా చేయడం సంతోషం అన్నారు. సూర్య నారాయణ రెడ్డి భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్నా నని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి పల్లె ముస్తఫా, మున్రెడ్డి ఎల్లారెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి, మహబూబ్ బాషా, సత్తార్, రఫీ, గోరే, నరసింహారెడ్డి, కేశవ, జిలాని తదితరులు పాల్గొన్నారు.