ఉగ్రదాడిపై “మానవత” ఆగ్రహం

పర్యాటకుల మృతికి ఘన నివాళి

మతోన్మాద పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు

మనన్యూస్,తిరుపతి:కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాద పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి కాల్చి చంపిన పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదని తిరుపతి మానవత శాఖ తీవ్రంగా హెచ్చరించి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఉదయం తిరుపతిలోని రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మానవతా సభ్యులు ముష్కరుల దాడిలో మృతి చెందిన హిందూ బంధువులకు మౌనం పాటించి, ఘన నివాళి అర్పించారు. కాశ్మీర్ ఘటనను మతోన్మాద దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఓంకారంతో పుష్పాంజలి ఘటించి భారత్ మాతాకీ జై, వందేమాతరం, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పాక్ ఉగ్రవాద ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ దేశంలో పాక ఉగ్రవాదులను ఏరి పారేయాలి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భగవంతుని ప్రార్థించారు. అనంతరం మానవతా నెలవారి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్వి కృష్ణారెడ్డి, చైర్మన్ భార్గవ, కో చైర్మన్ రాళ్లపల్లి మాధవ నాయుడు, అధ్యక్షులు ఎన్వి రమణ, కార్యదర్శి సుకుమార్ రాజు, కోశాధికారి భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు వేణుగోపాల్, పద్మనాభం, భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, సిరిగిరి శంకర్ రాజు, గురు ప్రసాద్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, సాయి కృష్ణమరాజు, సుందర కుమార్ రాజు, కోనేటి రవి రాజు,బాలాజీ నాయుడు, మాధవ రాజు, నరసింహులు, మార్కండేయ రెడ్డి, రామస్వామి, సాయి రెడ్డి, నిరంజన్ నాయుడు, లోక్ సింగ్, షణ్ముగం, రమణయ్య, సుధాకర్ బాబు, నీరజ,భార్గవి, నవీన్, ప్రవీణ్, లోకేష్, సుధాకర్ అధిక సంఖ్యలో మానవతామూర్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!