

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్ఫ్రైడే, ఈస్టరు పండుగలు సందర్భంగా శంఖవరం మండలం సేవకులు, క్రైస్తవ విశ్వాసుల ఆద్వర్యంలో కత్తిపూడిలో రన్ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, దడాల బాబ్జి తదితరులు జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రీస్తు బోధనాలు, సిలువ మరణము, పునరుద్దానము గూర్చి కొనియాడారు. ప్రభువైన క్రీస్తు కృపా కాపుదల కత్తిపూడి గ్రామమంతట ఉండాలని కోరారు.అనంతరం వైద్యులు పెదపాటి ఆనంద్ మాట్లాడుతూ, 2015 వ సం. నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పది సంవత్సరాలు దేవుని కృప, గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవకులకు, క్రైస్తవ సభ్యులకు కత్తిపూడి యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దలు వెన్న శివ, సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, శంఖవరం ది. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కె. హరినాథ్ ను ఘనంగా సన్మానించారు. మాజీ యువకులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్నవారికి బహుమతులు అందజేసారు. రన్ఫర్ జీసెస్ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు దువ్వాడ సాల్మాన్రాజు, శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎం. భాస్కరరావు, దడాల యాకోబు, పాస్టర్ ఎమ్. ప్రకాష్, అధ్యక్షులు ఎలీషా, కార్యదర్శి పి.టి. పౌల్, , తాతపూడి జోసెఫ్, తిరగటి సతీష్ టి సన్నీ, నందికోళ్ళ హారీష్, యస్ అనిల్, కూటమి నేతలు పాల్గొన్నారు.