జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి తో కలిసిఎమ్మెల్యే గాంధీ అధికారులతో సమీక్ష సమావేశం

మనన్యూస్,శేరిలింగంపల్లి:జోనల్ కార్యాలయంలో గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి పలు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నానాటికీ పెరుగుతున్న జనాభా ట్రాఫిక్‌ వాహనాల వినియోగం ప్రజా సౌకర్యాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా కృషి చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు నమోదవుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను మరింతగా వేగవంతం చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలోపు నాలల విస్తరణ పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని,నాలల పూడికతీత పనులు వేగవంతం చేయాలని అన్నారు. రహదారుల విస్తరణ, కూడళ్ల అభివృద్ధి, డైనేజీ సమస్యలు, రహదారులపై గుంతలు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని , సమన్వయం లోపిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పీఏసీ ఛైర్మన్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్‌ పాత్‌ల ఆక్రమణలను తొలగించాలని,పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని,చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృదిని చేపట్టాలని సూచించారు. గంగారం హనుమాన్‌ దేవాలయం నుంచి అపర్ణ వరకు వంద ఫీట్ల రోడ్డు, శ్రీదేవీ థియేటర్‌ రహదారి విస్తరణ సహా లింక్‌ రహదారుల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని , అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని పీఏసీ ఛైర్మన్‌ గాంధీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ జికెడి ప్రసాద్, ఈఈ ఇంద్ర బాయి ,డీఈలు దుర్గ ప్రసాద్, విశాలాక్షి, శ్రీదేవి, ఏఈ లు జగదీష్, ప్రశాంత్, రషీద్, ప్రతాప్, సంతోష్ , సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..