మహిళలకు ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిబాపూలే…

  • *ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు…*

మన న్యూస్ నంద్యాల (అపురూప్): మహిళలకు ఆదర్శనీయులు జ్యోతిబా పూలే అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణం నందలి మహాత్మ జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికల) నందు యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ,డోన్ మండల కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే గారి198 వ జయంతి సందర్భంగా పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్ వసుంధర దేవి యస్సీ యస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మిడి లక్ష్మణ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహిళల విద్య కొరకు పాటుపడిన మహోన్నతమైన మహనీయులు జ్యోతిబా పూలే అని ఆమె అన్నారు. తన భార్య అయిన సావిత్రిబాయిపూలే కు చదువు నేర్పించి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఆమె ద్వారా మహిళలకు విద్యనందించి మహిళలను గౌరవించిన జ్యోతిరావుపూలే మహిళలకు ఆరాధ్యదైవం అని ఆమె తెలిపారు. మహిళలు, క్రింది కులాల వారు చదువుకుని విజ్ఞానవంతులు అయితేనే సామాజిక చైతన్యం కలుగుతుందని, సామాజిక చైతన్యం వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి వైపు అడుగులు వేయగలరని పూలే ఆశించారని ఆమె అన్నారు. బహుజన కులాల అభివృద్ధి కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28 వ తేదీన కన్నుమూశారు. ఆ మహనీయుల ఆలోచనలతో, వారి ఆశయాల కోసం బహుజనులు అందరూ ఏకమై కృషి చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షురాలు భారతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ,నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, గుత్తి మండల అధ్యక్షురాలు సుంకమ్మ, షేకున్ బి, లక్మేశ్వరి, ఖాసీంబీ దస్తగిరమ్మ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?