మండేటి వెంగళ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు 53 వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తో నగర ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 53 డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండేటి వెంగళ్ రెడ్డిని 53 వ డివిజన్ వైసిపి ఇన్ చార్జ్ గా ప్రకటించారు.
ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.వెంగళ్ రెడ్డి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంత సేవలందిస్తామని డివిజన్ ప్రజలు తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజాగ్రహానికి లోనయ్యాడని..తెలిపారు.
ప్రజల్లో మార్పు వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు .ఈ రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా వినిపిస్తుందన్నారు.పార్టీకి కష్ట కాలంలో సేవలందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు.
డివిజన్ ప్రజలతో చర్చించిన తర్వాత వెంగల్ రెడ్డి ని 53వ డివిజన్ ఇంచార్జిగా.. ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
డివిజన్ ప్రజలు సమన్వయంతో పనిచేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నీలి రాఘవరావు , 11 వ డివిజన్ ఇంచార్జ్ మహేష్ స్థానిక 53 వ డివిజన్ నేతలు బ్రహ్మారెడ్డి, నాగరాజు, విజయ , నిర్మల , వెంకట రమణమ్మ , తిరుపతయ్య గారు, హజరతయ్య , ప్రసన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?