క్రీడాకారుల నిధులు రోజా రూ. 119 కోట్లు దోచేశారు..

మనన్యూస్,తిరుపతి:వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పేద క్రీడాకారులకు రూ. 119 కోట్లను దోచేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవి నాయుడు మాట్లాడారు.మాజీ మంత్రి రోజాను అరెస్టు చేయటానికి దమ్ము అవసరం లేదని, పోలీస్ వారెంట్ ఉంటే చాలు అని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న రోజా క్రీడాకారులకు చెందిన వందలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. త్వరలో రోజా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. రోజా క్రీడాకారుల డబ్బులతోనే బంగారు నగలు, నక్లెసులు, కార్లు, భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రోజా నోటితో వల్లే 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి కేవలం 11 సీట్లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఏక వచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి రోజా చెన్నైలో మకాం వేసిందని, ఆమెకు చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో జరిగే అభివృద్ధి సంక్షేమం గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీకెండ్ పొలిటిషన్ గా మారిపోయారని, కర్ణాటకలో బిజినెస్ లు చూసుకుంటున్న జగన్ అక్కడే ఉండిపోవాలని సూచించారు. తిరుపతిలో ఉన్న వైసీపీ నాయకులు పగటివేషగాళ్లు లాగా తయారయ్యారని, భూమన కుటుంబాన్ని ప్రజలు చీదరించుకున్న ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచలేదన్న విషయం భూమన అభినయ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ భూమన అభినయ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భూమన అభినయ రెడ్డి రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గంలో భూమన భూభాగోతం అందరికీ తెలిసిందేనన్నారు. టిడిఆర్ బండ్ల కుంభకోణంలో అసలు పాత్రధారి భూమన అధినాయక్ రెడ్డి అని, త్వరలో ఆ కుటుంబం జైలుకు పోవడం ఖాయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తే తప్పేంటి అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలకు రవి నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణా యాదవ్, యువత నాయకులు హేమంత్ రాయల్, సందీప్ పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?