

మన న్యూస్: ట్రాక్టర్ డికొని వ్యక్తి మృతి చెందిన ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 10గంటలకు చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన నీల ఇస్తారి (55)సైకిల్ పై సినిమా టాకీస్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వైపు వెళ్తుండగా వెనక నుండి ఇసుక ట్రాక్టర్ వెనుక భాగం ఢీకొని వెనుక చక్రం తల మీద నుండి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతినికి భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె లు ఉన్నట్లు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.