

మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షునిగా మరొక్కసారి నాగేంద్రరాజు పలివెలని వైసిపి అధిష్టానం నియమించింది.ఆయనను ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి,ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జి ముద్రగడ గిరిబాబుకి ఋణపడి ఉంటానని నాగేంద్ర రాజు పలివెల ఒక ప్రకటలో తెలిపారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని,ప్రజలపక్షనా వైయస్సార్సీపీ పార్టీ పోరాడుతుందని,
పార్టీ విదివిధానాలకు లోబడి,ప్రజల పక్షాన లీగల్ సెల్ పోరాడుతుందని, లీగల్ సెల్ సభ్యుల అందరూ ఎల్లప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని లీగల్ సెల్ అధ్యక్షులు నాగేంద్ర రాజు మీడియా ముఖంగా తెలియచేసారు.