

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గ:నర్వ మండల కేంద్రంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నాడు అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై కురుమయ్య. అనంతరం గ్రామస్తులు, ఎస్ఐ కురుమయ్యను శాలువాతో సత్కరించారు. అంబలి కేంద్రం దాత హోటల్ అంజయ్య గ్రామస్తులు అభినందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో దొంగతనాలు ఆవానించ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ, విష్ణు, గ్రామస్తులు, భగవంతు, రాజేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, వడ్ల బాలస్వామి, నర్సింలు సాయిలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
