వైఎస్సార్ లేక పోతే నువ్వు ఎవ‌రు? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డీః జ‌న‌సేన పార్టీ నగర అధ్యక్షులురాజా రెడ్డి

మనన్యూస్,తిరుప‌తి:త‌న తండ్రి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాకే ప్రజాప్ర‌తినిధిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నికైయ్యార్న వాస్త‌వాన్ని మ‌రిచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి అన్నారు.గురువారం ఉద‌యం రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దే ప‌దే అడుక్కోవ‌డం ఆయ‌న ప‌ద‌వీ కాంక్ష‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.తొలిసారి ఎమ్మెల్యే అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిబంధ‌న‌లు గుర్తు చేస్తే ప‌ర‌దాల రెడ్డి ఫ్ర‌స్టేష‌న్ లో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పోరేట‌ర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు త‌క్కువ‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వార్డు మెంబ‌ర్ కు ఎక్కువ స‌ర్పంచ్ కు త‌క్కువ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకున్న‌ట్లు వైఎస్సార్ పేరు చెప్పుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపి, ఎమ్మెల్యే, సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంది నిజం కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ విళాస‌వంత‌మైన జీవితాన్ని వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ప‌దేళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలిచిన నాయ‌కుడని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు చెబితే 11 సిబిఐ కేసులు,కోడిక‌త్తి,గొడ్డ‌లి పోటు గుర్తు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గెలుస్తాడ‌న్న గ్యారంటీ లేద‌ని ఆయ‌న తెలిపారు.ఇక‌నైనా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేల‌డం ఆప‌క‌పోతే త‌గిన మూల్యం జ‌న‌సైనికులు ఇస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.ఈ స‌మావేశంలో జ‌న‌సేన నాయ‌కులు బాబ్జీ,రాజేష్ ఆచ్చారి,కీర్త‌న‌,మున‌స్వామి,ఆముదాల వెంక‌టేష్, ర‌మేష్ నాయుడు,ప‌వ‌న్,హేమంత్,జాన‌కిరామి రెడ్డి,ఉద‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!