వైఎస్సార్ లేక పోతే నువ్వు ఎవ‌రు? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డీః జ‌న‌సేన పార్టీ నగర అధ్యక్షులురాజా రెడ్డి

మనన్యూస్,తిరుప‌తి:త‌న తండ్రి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాకే ప్రజాప్ర‌తినిధిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నికైయ్యార్న వాస్త‌వాన్ని మ‌రిచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి అన్నారు.గురువారం ఉద‌యం రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దే ప‌దే అడుక్కోవ‌డం ఆయ‌న ప‌ద‌వీ కాంక్ష‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.తొలిసారి ఎమ్మెల్యే అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిబంధ‌న‌లు గుర్తు చేస్తే ప‌ర‌దాల రెడ్డి ఫ్ర‌స్టేష‌న్ లో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పోరేట‌ర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు త‌క్కువ‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వార్డు మెంబ‌ర్ కు ఎక్కువ స‌ర్పంచ్ కు త‌క్కువ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకున్న‌ట్లు వైఎస్సార్ పేరు చెప్పుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపి, ఎమ్మెల్యే, సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంది నిజం కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ విళాస‌వంత‌మైన జీవితాన్ని వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ప‌దేళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలిచిన నాయ‌కుడని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు చెబితే 11 సిబిఐ కేసులు,కోడిక‌త్తి,గొడ్డ‌లి పోటు గుర్తు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని ఆయ‌న చెప్పారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గెలుస్తాడ‌న్న గ్యారంటీ లేద‌ని ఆయ‌న తెలిపారు.ఇక‌నైనా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేల‌డం ఆప‌క‌పోతే త‌గిన మూల్యం జ‌న‌సైనికులు ఇస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.ఈ స‌మావేశంలో జ‌న‌సేన నాయ‌కులు బాబ్జీ,రాజేష్ ఆచ్చారి,కీర్త‌న‌,మున‌స్వామి,ఆముదాల వెంక‌టేష్, ర‌మేష్ నాయుడు,ప‌వ‌న్,హేమంత్,జాన‌కిరామి రెడ్డి,ఉద‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్