గవి మఠంలో పచ్చదనం – పరిశుభ్రతపై భక్తుల ఆవేదన

అక్కడ అలా… ఇక్కడ ఇలా!

ఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లా గవిమఠం సంస్థాన ఆవరణంలో పచ్చదనం తాండవిస్తుంది. జీవ సమాధి క్షేత్రాల ఎదుట, చుట్టుపక్కల డా. కరి బసవ రాజేంద్ర స్వామీజీ స్వయంగా పర్యవేక్షణలో పండ్లూ, పూలూ, ఔషధ మొక్కలూ నాటించి వాటి సంరక్షణ చేస్తున్నారు. ఈ చర్యలతో జీవ సమాధి ప్రాంతం ప్రకృతిశోభతో కళకళలాడుతోంది. అయితే, ఇదే సమయంలో మఠం ఇతర ప్రాంతాల్లో మాత్రం దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. పైన పటారం ఉండగా, లోపల మాత్రం లొటారంలా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మఠం బావి చుట్టూ చెత్త చెదారం పేరుతో దుర్వాసన వెదజల్లుతోందని, బావిలో నీటిమట్టం పెరుగుతున్నప్పటికీ పాచి, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల అభిప్రాయం ప్రకారం, బావిలోని నీటిని శుద్ధించి, మొక్కల పెంపకానికి వినియోగిస్తే ఆధ్యాత్మిక ప్రదేశం మరింత ప్రశాంతతను పొందుతుంది. అలాగే మఠం ఆవరణంలో ఓ చిన్న పార్కు ఏర్పాటు చేసి, ఔషధ మొక్కలను పెంచితే భక్తులకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ కలుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి… గవిమఠంలో పచ్చదనానికి తోడు పరిశుభ్రతను కూడా సమపాళ్లలో కొనసాగిస్తే ఆ స్థలం భక్తులకే కాక ప్రకృతికీ పునీతమవుతుంది.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ