అంబేద్కర్ కాలనీలో ఏఈ, విద్యుత్ సిబ్బంది చొరబడి అక్రమ విద్యుత్ కట్ — దళితుల ఆవేదన

ఉరవకొండ, మన న్యూస్:
అంబేద్కర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చట్టాలను పక్కన పెట్టి దళితుల ఇళ్లలోకి చొరబడి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాధితులు ఇది విద్యుత్ చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. విద్యుత్ చట్టం-2003 ప్రకారం, వినియోగదారు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ కట్ చేయడానికి సెక్షన్ 56(1) కింద 15 రోజుల రాతపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయినా, సోమవారం ఏఈ, సిబ్బంది నిబంధనల ఉల్లంఘనగా దళితుల ఇళ్లలోకి చొరబడి విద్యుత్ నిలిపివేశారు. ఈ చర్యలు చట్టపరంగా నిలవవని, అవి వివక్షతో కూడినవని స్థానికులు విమర్శించారు.

వినియోగదారులకు ఉన్న హక్కులు:

  • ఎస్సీ, ఎస్టీలకు “జగత్ జ్యోతి పథకం” కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • చేనేత కార్మికులకు 200 యూనిట్లు
  • మరమగ్గాలకు 500 యూనిట్లు
  • సెలూన్ నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు
  • వ్యవసాయానికి రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్

బాధితుల వాదన: వీరందరూ ఉచిత విద్యుత్ పొందే హక్కుదారులే అని స్పష్టం చేస్తూ, విద్యుత్ శాఖ అధికారుల తీరును ఖండించారు. పురుషులు లేని సమయంలో ఇళ్లలోకి చొరబడటం, విద్యుత్ బిల్లు చెల్లించలేదు అన్న కారణంతో చట్టబద్ధ ప్రక్రియ లేకుండానే సరఫరా నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వానికి ఫిర్యాదు: “ఉరవకొండలోని పలు ప్రభుత్వ సంస్థలు బిల్లులు చెల్లించకుండానే విద్యుత్ వాడుతున్నా, వారిపై చర్యలు తీసుకోకపోవడం దళితుల పట్ల వివక్షను నాటుగా వెల్లడిస్తోంది,” అని వారు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. మరియు వారు స్పష్టం చేసినది: “విద్యుత్ సరఫరా వల్ల ప్రజల ప్రాణాలకు లేదా ఆస్తికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో మాత్రమే ముందస్తు నోటీసు లేకుండా విద్యుత్ కట్ చేయవచ్చు. కానీ ఈ ఘటన అలాంటిదే కాదు” అని వారు పేర్కొన్నారు. సదరు చర్యలు విద్యుత్ శాఖ నిబంధనలకు విరుద్ధమని, తమకు న్యాయం కోసం వినియోగదారుల ఫోరంను లేదా లోక్‌యుక్తను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *