

గూడూరు, మన న్యూస్ :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రాస్పరో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న….గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని అన్నారు. విద్యా శాఖ మాత్యులుగా బాధ్యత చేపట్టినప్పటి నుండి లోకేష్ బాబు నిరతరం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చి పిల్లలు ఎంతో అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఎంత మంది చదువుతుంటే అంతమందికి డబ్బులు జమ చేశారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలను స్కూల్ కు పంపించి మంచి ఉన్నత స్థితి లో ఉంచేలా చూడాలని అన్నారు.గూడూరు పట్టణం :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా.పట్టణం లోని చిల్లకూరు శేషమ్మ మునిసిపల్ స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొని, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపబరిచిన పిల్లలకు బహుమతులు అందించి,స్కూల్ ప్రాంగణం నందు మొక్కలు నాటుతున్న….
ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు పట్టణం :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నందు నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొని, నాట్యం పోటీ లలో ప్రతిభ కనపబరిచిన పిల్లలకు బహుమతులు అందించి,స్కూల్ ప్రాంగణం నందు మొక్కలు నాటిన ఎమ్మెల్యే సునీల్ కుమార్.

