ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా,డాన్స్ బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో, ఉల్లాసంగా,ఉత్సాహంగా గడుపారు.సుమారు 4000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శీను,అప్పికొండ అయ్యప్పలను పత్రి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దలు చేతుల మీదుగా పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైనా చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేసారని కొనియాడారు.ఇకపై మనమందరం ఐకమత్యంగా ఉండి సంఘంగా ఏర్పడి మన పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి గుర్తించి వారికి చేయూతనివ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, అందరూ కలిసికట్టుగా ఉంటూ రిజర్వేషన్లతో పాటు అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!