

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండల సిరిపురం గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ (99 టీవీ రిపోర్టర్) కి ఇటీవల జరిగిన రోడ్డు అయినవి.ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న పత్తిపాడు నియోజవర్గం వరుపుల సత్యప్రభ ఆదివారం వారి స్వగృహంలో పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును మరియు వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబం సభ్యులు మరియు పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు