అధిక దిగుబడితో రైతులు సంతోషంగా ఉండాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు:- సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్నదాతలకు లబ్ధి.- 24 గంటల్లోనే ధాన్యం అమ్మకాల నగదు జమ.- రైతుల తొలి పండుగ ఏరువాక పౌర్ణమి.నాగరికత ఎంత పెరిగినా.. నాగలి లేనిదే పని జరగదని, రైతు లేనిదే పూట గడవదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ప్రశాంతమ్మకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై ఊరేగించుకుంటూ గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం వ్యవసాయ పనిముట్లకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్ల బండిపై ఎక్కి ఏరువాక ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ… వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి అని, డెల్టా ప్రాంతమైన కోవూరులో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. సాగునీరు రైతులకు సరిపడా ఉందని, ఈ ఏడు పంటలు బాగా పండాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, స్వర్ణాంధ్ర@2047 ద్వారా వ్యవసాయం, మత్స్యకార రంగం, రవాణా రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సహకారంతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంట కాలువల్లో ఎక్కడికక్కడ పూడికలు తొలగించి రైతులకు మేలు చేశామన్నారు. ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నగదు చెల్లించి రైతులను ఆదుకుందని చెప్పారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండాలని, అధిక దిగుబడులు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బెజవాడ వంశీ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొమ్మి మురళీ రెడ్డి, అలగర వినోద్‌కుమార్‌, అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేష్‌, ప్రభాకర్‌, విజయ్‌కుమార్‌, సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు రాఘవేంద్రరావు, కోటిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య…

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- మెట్ట ప్రాంత రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన ఘనత దివంగత నేత స్వర్గీయ వరుకుల రాజాకే చెందుతుందని రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ