కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీ..

  • అడుగడుగునా ఎమ్మెల్యే సత్య ప్రభకు హారతులు పట్టిన మహిళలు..
  • కత్తిపూడి లో ఘన స్వాగతం పలికిన జన సైనికులు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): సూపరిపాలనలో కూటమి ప్రభుత్వానికి ఏడాది అయ్యిందని ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించామని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 2024 ఎన్నికల్లో ఎన్.డి.ఏ. పార్టీలు అఖండ విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ విజయోత్సవ జన ప్రదర్శనలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.‌ ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుండి శంఖవరం మండలం అన్నవరం గ్రామం వరకూ ఈ ర్యాలీని నిర్వహించారు.‌ పెదశంకర్లపూడిలో ప్రారంభమైన ఈ ర్యాలీ లంపకలోవ, ఉత్తరకంచి, ఒమ్మంగి, శరభవరం, గజ్జనపూడి, చింతలూరు, వెంకటనగరం,‌ ఉద్దండ జగన్నాధపురం, శంఖవరం మండలం కొంతంగి, కొత్తూరు, నెల్లిపూడి, కత్తిపూడి గ్రామాల మీదుగా అన్నవరం చేరుకున్నది. ఈ అన్ని గ్రామాల్లోని ర్యాలీల్లోనూ సత్యప్రభకు ప్రజలు పూలు జల్లి, గజ మాలలు వేసి, హారతులు ఇస్తూ జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ యాత్ర అన్నవరంలో సత్యనారాయణ స్వామి పాదాల చెంత ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించా మన్నారు. బలమైన కేడర్‌, కార్యకర్తల కృషి వల్లే గత ఎన్నికల్లో విజయం సాధించా మన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీని వీడకుండా అన్ని వర్గాల వారిని వేధిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కృషి చేశారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 40 కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టా మన్నారు. వీటికి అదనంగా మరో రూ.‌ 10 కోట్లతో ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. కాంక్రీటు సిమెంట్, తారు రోడ్లను, అంగన్వాడి భవనాలు, వసతి గృహాలు ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో వేగవంతంగా జరుగుతున్నాని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పర్వత సురేష్,
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి), జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి, శంఖవరం జనసేన పార్టీ నాయకులు మేకల కృష్ణ, ఉల్లి వీరభద్రరావు, అంబటి బుజ్జి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సాధనాల లక్ష్మీ బాబు, పిర్ల అప్పారావు బద్ది రమణ, బద్ది రామకృష్ణ ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…