పి 4. విధానంతో పేదరిక నిర్మూలన……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:- సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే సత్ఫలితాలు .- విజన్ యాక్షన్ ప్లాన్ తో సమగ్రాభివృద్ధి.ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్‌ పి-4 అని, ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాల్ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రఘురామయ్య తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేస్తున్న స్వర్ణాంధ్ర`2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సరికొత్త ఆలోచనలతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు కోసం ఎమ్మెల్యేతో పాటు 9మంది సభ్యులను నియమిస్తున్నట్లు చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు మనసుపెట్టి పనిచేస్తే మంచి పేరుతో పాటు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలుచేసి పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు చెప్పారు. మన జిల్లాలో ఆక్వారంగం బాగుందని, ఈ రంగం అభివృద్ధికి పి-4 విధానాన్ని జోడించి అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలన్నదే స్వర్ణాంధ్ర విజన్‌ప్లాన్‌ ప్రధాన ఉద్దేశంగా ఎంపీ చెప్పారు. తద్వారా రాష్ట్ర జిడిపి బాగా పెరిగి అన్నిరకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలోని ఉన్నతవర్గాల వారు పేదలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలిచే గొప్ప కార్యక్రమం పి-4 అని ఎంపీ కొనియాడారు. ప్రతి ఒక్కరు కూడా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎంపీ పిలుపునిచ్చారు.

  • Related Posts

    తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

    పాల సముద్రం , మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం ఆముదాల పంచాయితీ రంగాపురం గ్రామానికి చెందిన శాంతమ్మ చిన్నబ్బనాయుడు దంపతులకు 1983 వ సంవత్సరంలో తాళ్లూరి శివ నాయుడు జన్మించాడు..తాళ్లూరి శివ నాయుడు విద్యాభ్యాసం.. తాళ్లూరి…

    రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

    మన న్యూస్ పాచిపెంట జూన్ 10:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు సిపిఎం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

    తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

    రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

    రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

    ఎస్టీవి న‌గ‌ర్ న‌డివీధి గంగమ్మ‌కు సారె సమర్పించిన ఎమ్మెల్యే ‘ఆర‌ణి’

    ఎస్టీవి న‌గ‌ర్ న‌డివీధి గంగమ్మ‌కు సారె సమర్పించిన ఎమ్మెల్యే ‘ఆర‌ణి’

    మహిళలను సంకరజాతి అంటారా.,మనుషులా ?మృగాల ? మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

    మహిళలను సంకరజాతి అంటారా.,మనుషులా ?మృగాల ? మంత్రి గుమ్మిడి  సంధ్యారాణి

    ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల తనిఖీలతో బయటపడుతున్న నిజాలు,

    ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల తనిఖీలతో బయటపడుతున్న నిజాలు,

    ఘనంగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జయంతి

    ఘనంగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జయంతి