రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కూటమి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణమండపంలో ఆదివారం టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సొంతంగా కావలిలో మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రావడం జరిగిందని, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తల కృషి ఎనలేనిదని తెలిపారు. ఇదేవిధంగా రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మునిసిపాలిటీని కైవసం చేసుకుందామని తెలిపారు. కావలి పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులను కలుపుకొని పోదామని, వారికి ప్రాధాన్యత ఇద్దామని తెలిపారు. కావలి పై చంద్రబాబుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నదని, అందుకే అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల వయసులో దేశం కోసం మోడీ, రాష్ట్రం కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. నాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదని, నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం అని తెలిపారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ లోకేష్ ను ముఖ్యమంత్రి గా చేసుకొని ఋణం తీర్చు కుంటానని తెలిపారు. 2024 ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరిని వదులుకోనని తెలిపారు. నేను కష్టాల్లో ఉన్న సమయంలో చిన్న సహాయం చేస్తేనే మర్చిపోలేనని అలాంటిది రెండు నెలల పాటు నా ఎన్నికల కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలను ఎలా మర్చిపోగలనని అన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజా సమస్యల పరిష్కారం లో ఉంటామని, రాత్రి 7 గంటలు తరువాత నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను స్వయంగా తెలుపుకోవచ్చని తెలిపారు. రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నానని, మీ ప్రోత్సాహం కూడా అవసరమని తెలిపారు. వ్యాపారాలను సైతం పక్కన పెట్టి ప్రజాసేవ చేస్తున్నానని, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పార్టీ స్టేనుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు రాష్ట్రాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. కావలిని కాపు కాస్తానని, ముఖ్యమంత్రి సహకారం తో కావలి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. దగదర్తి నుండి కొంతమంది నాయకులు, కావలి నుండి కొంతమంది నాయకులు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలోనే వారిని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కావలి రూరల్ మండల టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, అల్లూరు మండల టిడిపి అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి విటల్, సిద్దు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!