

మన న్యూస్ శంఖవరం (అపురూప్) దళిత ఉద్యమ నేత బిఎస్పి పిఠాపురం ఇన్చార్జ్ కండవల్లి లావరాజుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా ఉగాది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో ఈ అవార్డును లోవరాజుకు అందజేశారు. పిఠాపురానికి చెందిన లోవరాజు పలు దళిత ఉద్యమాలలో చురుగ్గా పనిచేశారని భూ పోరాటాలు అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు మరింత ఉత్సాహంగా దళిత సోదరులకు అండగా ముందుకు కొనసాగుతానని దళితుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.