ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు ఆవార్డు పట్ల పలువురు హర్షం

మనన్యూస్,పిఠాపురం:సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ విఘేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డా॥ సునీల్ కుమార్ యాండ్రను హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. గత 4నెలల క్రితం శ్రీవిశ్వకర్మ క్రియేషన్స్, ఆర్.కె.క్రియేటివ్స్, జి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన బంగారు తల్లి లఘుచిత్రంలో టిక్టాక్ స్టార్ దుర్గారావు దంపతులు, చైల్డ్ ఆర్టిస్ట్ మంజూశ్రీ, నటులు ఆర్.కె, దాకే సింహాచలం, బాబి, సూరిబాబు, పెద్దాడ వెంకటేశ్వరరావు, ఇతర నటీనటులు నటించిన బంగారు తల్లి లఘుచిత్రం కోమటి రామకృష్ణ్ట (ఆర్.కె) దర్శకత్వం వహించగా టిక్టాక్ స్టార్ దుర్గారావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యిన అతి కొద్ది కాలంలోనే సుమారు లక్ష్యా 80వేల మంది ప్రేక్షకుల తిలకించి విశేష ఆదరణ కనబరిచారు. ఈ సంధర్భంగా నంది ఆవార్డు గ్రహీత డా॥ సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ ఈ ఆవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ ఫౌండర్ ఛైర్మన్ బండారి శ్రీధర్ నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సంధర్భంగా ఆవార్డు ప్రధానం చేయడం జరిగిందని, ఈ ఆవార్డు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, వెండితెర, బుల్లితెర నటుడు జెమిని సురేష్, నటులు దిల్ రమేష్, బి.హెచ్.ఈ.ఎల్.ప్రసాద రావు, సినీయర్ దర్శకులు బాబ్జి, నిర్మాత ముసాఆలీఖాన్, మోడల్ సృజన, జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ చంద్రబాబు, సుమిత్ మీడియా సిఈఓ వంశీకృష్ణల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిదన్నారు. బంగారు తల్లి చిత్రానికి దర్శకత్వం వహించిన డా॥ కోమటి రామకృష్ణకు కూడా ఉత్తమ దర్శకుడిగా ఆవార్డు లభించిందన్నారు. ఈ సంధర్భంగా డా॥ సునీల్ కుమార్ కు పిఠాపురం పట్టణ ప్రముఖులు, రాజకీయనాయకులు, స్నేహితులు, పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Related Posts

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్ర గాయానికి దారి తీసింది. ఈ ఘటనలో తన్నీరు రవి (45) కూలీ పని చేసుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.